![కొత్త కోడూరు సమస్యను పరిష్కరించిన బత్యాల కొత్త కోడూరు సమస్యను పరిష్కరించిన బత్యాల](https://media.getlokalapp.com/cache/d0/e2/d0e2f3e499aee9d8b56443d5a14afec1.webp)
కొత్త కోడూరు సమస్యను పరిష్కరించిన బత్యాల
టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల రాయుడు సోమవారం రైల్వే కోడూరులోని కొత్తకోడూరును సందర్శించారు. అక్కడ కంప చెట్లు, పిచ్చి మొక్కలు పెరిగిపోయి పాములు, దోమలు ఎక్కువగా ఉన్నాయని అక్కడి ప్రజలు తెలిపారు. వెంటనే జెసిబిని పిలిపించి సొంత ఖర్చుతో పిచ్చి మొక్కలు, కంప చెట్లను తొలగించారు. ఈ కార్యక్రమంలో కోడూరు మాజీ ఉప సర్పంచ్ నార్జాల హేమరాజ్, సుధాకర్, మల్లికార్జున పాల్గొన్నారు.