రాజంపేట నియోజవర్గం లో మునుపటి లాగానే క్రియాశీలకంగా ఉంటూ కార్యకర్తల, నాయకుల ప్రజా సమస్యల పరిష్కారం కోసం రెట్టించిన ఉత్సాహంతో పార్టీ సంక్షేమం కోసం పని చేస్తానని రాజంపేట పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు చెమ్మర్తి జగన్ మోహన్ రాజు అన్నారు. ఆయనను ఒంటిమిట్ట మండలానికి చెందిన టిడిపి నేతలు ఆదివారం రాజంపేటలో కలిశారు. శాలువా కప్పి, పుష్ప మాల వేసి ఘనంగా సత్కరించారు. మండల టిడిపి నేతలు పాల్గొన్నారు.