రైలు ఢీకొని యువకుడి మృతి
అక్కన్నపేట గ్రామ శివారులో బైక్ ని రైలు ఢీకొట్టిన ఘటనలో మృతుడి వివరాలను రైల్వే పోలీసులు గుర్తించారు. మృతుడు కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కొండాపూర్కి చెందిన మాలోత్ ప్రకాశ్ గుర్తించారు. తన సొంత పనులపై ద్విచక్రవాహనంపై మెదక్ వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు రైల్వే పట్టాలు దాటుతుండగా.. రైలు ఢీకొట్టింది. పోలీసులు కేసు నమోదు చేశారు.