ఏపీ ఎన్నికలు.. వాటికి అనుమతి తప్పనిసరి

85చూసినవారు
ఏపీ ఎన్నికలు.. వాటికి అనుమతి తప్పనిసరి
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా రాజకీయ పార్టీలకు కీలక సూచనలు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం, సభలు, సమావేశాలతో పాటు కరపత్రాలు పంపిణీ, రాజకీయ ప్రచార సామగ్రి అనుమతి, ఊరేగింపులు, యాత్రలు, ర్యాలీలు నిర్వహించాలనుకుంటే ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి ముందస్తు అనుమతులు పొందాలన్నారు. ఈ మేరకు అన్ని పార్టీలకు ఆయన లేఖలు పంపారు.

సంబంధిత పోస్ట్