ఆ పార్టీకి 50 శాతంలోపే ఓట్లు: సజ్జల

158436చూసినవారు
ఆ పార్టీకి 50 శాతంలోపే ఓట్లు: సజ్జల
వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. అయితే గెలుపు ఎవరిదనే దానిపై సర్వేలు విడుదల అవుతున్నాయి. కొన్ని వైసీపీకి అనుకూలంగా.. మరికొన్ని కూటమికి అనుకూలంగా సర్వేలు చెబుతున్నాయి. సర్వేలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ వంద శాతం గెలుస్తుందన్నారు. ఎన్ని పార్టీలు కూటమిగా కలిసి వచ్చినా వాటికి 50 శాతంలోపే ఓట్లు వస్తాయని సజ్జల జోస్యం చెప్పారు.

సంబంధిత పోస్ట్