'ఆరోగ్యశ్రీలో చికిత్సలను తొలగించట్లేదు'

62చూసినవారు
'ఆరోగ్యశ్రీలో చికిత్సలను తొలగించట్లేదు'
ఆరోగ్యశ్రీపై వస్తున్న వార్తలను ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఖండించింది. ఆరోగ్యశ్రీలో ప్రస్తుతం ఉన్న 3,257 చికిత్సలను 1,949కి తగ్గిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలిపింది. ఆరోగ్యశ్రీపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడింది. ఈ పథకంలో ఎలాంటి మార్పులను ప్రభుత్వం చేయట్లేదని స్పష్టం చేసింది. ఆరోగ్యశ్రీపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్