ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదునైన ఆయుధాల వినియోగంపై నిషేధం కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పలు జిల్లాల్లో పదునైన ఆయుధాల వినియోగంపై 6 నెలల పాటు నిషేధం విధించారు. కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం, అన్నమయ్య, నంద్యాల, సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో ఈ నిషేధం ఉండనుంది.