గుంటూరు జీజీహెచ్ లో నిర్మాణం జరుగుతున్న మాతా, శిశు సంరక్షణ కేంద్రం అభివృద్ధి కోసం రూ. కోటి విరాళాన్ని రోటరీ క్లబ్ ప్రకటించడం అభినందనీయమని, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్ నసీర్ అహ్మద్ అన్నారు. మంగళవారం ఆసుపత్రిలోని పాత ఓపీ విభాగం వద్ద ఏర్పాటు చేసిన సిమెంట్ బల్లలను ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే వెల్లడించారు.