నరసరావుపేట: జి.ఎన్.సాయిబాబా కు ప్రజా సంఘాలు ఘన నివాళి

78చూసినవారు
నరసరావుపేట: జి.ఎన్.సాయిబాబా కు ప్రజా సంఘాలు ఘన నివాళి
బుధవారం, ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ కామ్రేడ్ జి. ఎన్ సాయిబాబాకు నరసరావుపేట గడియార స్తంభం సెంటర్లో ప్రజాసంఘాలు నివాళులు అర్పించాయి. కేంద్ర ప్రభుత్వం తప్పుడు కేసుల ద్వారా ఆయనను 10 సంవత్సరాలు నాగపూర్ అండాసెల్ లో నిర్బంధించి, అనారోగ్యంతో మరణానికి కారణమైందన్నారు. సాయిబాబుతో సహా అనేక మంది జైలులో ఉన్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారిని వెంటనే విడుదల చేయాలని, ఉపా, ఎన్ఐఏను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్