ఒంగోలు నగరంలో రెచ్చిపోతున్న పెట్రోల్ దొంగలు

1894చూసినవారు
ఒంగోలు నగరంలో పెట్రోల్ దొంగలు రెచ్చిపోతున్నారు. ఇంటి ముందు పార్కింగ్ చేసిన బైకులలో నుంచి పెట్రోల్ తీసుకెళ్తున్నారు. నగర శివారులోని కాకతీయ నగర్ లోని హనుమంతురావు రోడ్డులో ఇళ్ళ ముందు ఉంచిన దాదాపు 15 బైకుల నుంచి ఆదివారం వేకువజామున పెట్రోల్ దొంగలించారని స్థానికులు తెలిపారు. పోలీసులు గస్తీ పెంచాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్