ఈనెల 23వ తేదీలోగా పంట నమోదు చేయించుకోవాలి

56చూసినవారు
ఈనెల 23వ తేదీలోగా పంట నమోదు చేయించుకోవాలి
రైతులు తమ పంట నమోదు వివరాలను ఈనెల 23వ తేదీలోగా రైతు భరోసా కేంద్రాల్లోని విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్లకు అందజేసి పంట నమోదు చేయించుకోవాలని రేపల్లె సహాయ వ్యవసాయ సంచాలకులు ఆర్ విజయ బాబు తెలిపారు. శుక్రవారం రేపల్లెలో ఆయన మాట్లాడుతూ.. రేపల్లె సబ్ డివిజన్ కు సంబంధించిన రైతులందరూ తప్పనిసరిగా పంట నమోదు చేయించుకోవాలన్నారు. పంట నమోదు చేయించుకోవడం వలన ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు రైతులకు అందుతాయి అన్నారు.