వైసీపీ మంత్రి గుమ్మనూరు జయరాం పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కర్నూల్ ఎంపీగా పోటీ చేయటం ఇష్టంలేక పార్టీ మారనున్నట్లు సమాచారం. ఇటీవల కార్యకర్తలతో జరిగిన సమావేశం తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ సమయంలో
కాంగ్రెస్ నేతలతో జయరాం సమావేశమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే
కాంగ్రెస్ ముఖ్య నేతలతో మంతనాలు జరిపినట్లు వినిపిస్తోంది. గుమ్మనూరు త్వరలోనే
కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.