కొంపముంచిన ఇన్‌స్టాగ్రామ్ పరిచయం.. మహిళ మృతి

66చూసినవారు
కొంపముంచిన ఇన్‌స్టాగ్రామ్ పరిచయం.. మహిళ మృతి
తూర్పు గోదావరి జిల్లా చక్రద్వారబంధం గ్రామానికి చెందిన ఓ వివాహితకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. వారి మధ్య పరిచయం పెరిగింది. ఈ క్రమంలో వివాహితకు మాయమాటలు చెప్పడంతో ఆమె తన వద్ద ఉన్న విలువైన బంగారం నగలు, రూ.4 లక్షల నగదు ఇచ్చింది. ఈ క్రమంలో ఇంట్లో వాళ్లు బంగారం, నగదుపై ప్రశ్నించడంతో కలహాలు మొదలయ్యాయి. దాంతో వివాహిత పుట్టింటికి వచ్చి ఉరేసుకుని మృతి చెందింది. మృతురాలికి ఒక పాప ఉన్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్