వైసీపీకి చెందిన ముఖ్యనేతలు టచ్లోకి వస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉండవల్లిలోని నివాసంలో టీడీపీ ముఖ్య నేతలతో ఆయన భేటీ అయ్యారు. "వైసీపీ నుంచి వచ్చిన అందరినీ పార్టీలోకి తీసుకోలేం. పొత్తులు, చేరికల వల్ల పార్టీలో కష్టపడిన నేతలకు నష్టం జరగకూడదు. వారి భవిష్యత్తుకు నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉంది. దానికే అధిక ప్రాధాన్యత ఇస్తాం." అని చంద్రబాబు తెలిపారు.