రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అంతర్జాతీయ అవార్డు లభించింది. లండన్కు చెందిన పబ్లిషింగ్ హౌస్ 'సెంట్రల్ బ్యాంకింగ్' రిస్క్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఆర్బీఐకి అందజేసింది. ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోరంజన్ మిశ్రా ఈ అవార్డును అందుకున్నారు. రిస్క్ కల్చర్, అవేర్నెస్ను ప్రోత్సహించినందుకుగానూ తనకు ఈ అవార్డు లభించిందని పేర్కొన్నారు.