హింసకు చంద్రబాబే కారణం: అంబ‌టి రాంబాబు

31081చూసినవారు
హింసకు చంద్రబాబే కారణం: అంబ‌టి రాంబాబు
AP: ఎన్నిక‌ల నేప‌థ్య‌లో పల్నాడులో జరిగిన అల్లర్లపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. "పల్నాడులో హింసకు టీడీపీ అధినేత చంద్రబాబే కారణం. హింసను ఆపడంలో పోలీసులు విఫలమయ్యారు. టీడీపీ శ్రేణులు ఓటర్లను భయపెట్టి పోలింగ్ కేంద్రాలకు రాకుండా అడ్డుకున్నారు. అధికారం రాదనే చంద్రబాబు ఎన్నికల సమయంలో హింసను ప్రేరేపించారు. అల్లర్లపై తన దగ్గర ఉన్న సమాచారం అంతా సిట్ అధికారులకు ఇచ్చా." అని ఆయ‌న తెలిపారు.

ట్యాగ్స్ :