AP: కోనసీమ జిల్లా రాజోలు మండలం ములికిపల్లి గ్రామంలో గ్యాస్ లీకేజీ కలకలం సృష్టిస్తోంది. కె.విజయేంద్రవర్మ ఆక్వా చెరువుల వద్ద గతంలో వేసిన బోరు నుంచి 15 మీటర్లు ఎత్తుకి గ్యాస్ ఎగిసిపడుతోంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది గ్యాస్ను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.