పెన్షన్ల వ్యవహారంపై ఈసీకి చంద్రబాబు లేఖ

2943చూసినవారు
పెన్షన్ల వ్యవహారంపై ఈసీకి చంద్రబాబు లేఖ
కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి లేఖ రాశారు. ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పథకాలు అందించాలన్న సీఈసీ సూచనలను అధికారులు పట్టించుకోవడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా సచివాలయాల దగ్గర వైసీపీ పెన్షన్లు ఇస్తున్నారని, టీడీపీని దోషిగా చూపిస్తూ రాజకీయ లబ్ధి పొందేందుకు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 40 డిగ్రీల ఎండలో వృద్ధులను సచివాలయానికి రప్పించారని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్