సామూహిక అత్యాచారానికి గురైన 12వ తరగతి బాలికను ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం పరీక్షలు రాయకుండా అడ్డుకుంది. ఈ దారుణ ఘటన రాజస్థాన్లోని అజ్మీర్లో చోటుచేసుకుంది. దీంతో ఆమె సీడబ్ల్యూసీకి ఫిర్యాదు చేసింది. పరీక్షకు హాజరైతే అక్కడ ఉన్న పిల్లలు కూడా చెడిపోతారని.. ఆవేదన వ్యక్తం చేశారు. 4 నెలలుగా పాఠశాలకు రాకపోవడంతో అడ్మిట్ కార్డు ఇవ్వలేదని యాజమాన్యం చెప్పగా, వారి సూచన మేరకు ఇంట్లోనే ప్రిపేర్ అయ్యానని బాలిక తెలిపింది.