ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. నెల్లూరు జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి చేజర్ల సుబ్బారెడ్డి ఇవాళ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇటీవలే నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవితో పాటు రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితోనే తన ప్రయాణమని చేజర్ల స్పష్టం చేశారు. వేమిరెడ్డితో కలిసి టీడీపీలో చేరతానని వెల్లడించారు.