తక్కువ ధరకే వంటనూనెలు: నాదెండ్ల

52చూసినవారు
తక్కువ ధరకే వంటనూనెలు: నాదెండ్ల
ఏపీ ప్రజలకు తక్కువ ధరలకే వంట నూనెలను అందించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పామాయిల్ లీటర్ ధర రూ.110, సన్‌ఫ్లవర్ ఆయిల్ లీటర్ ధర రూ.124కే ఇస్తామని చెప్పారు. అలాగే తక్కువ ధరకే కందిపప్పు కూడా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు విజయవాడలో వంటనూనెల దిగుమతిదారులతో మంత్రి భేటీ అయ్యారు. వంటనూనెలను మరింత ఎక్కువగా అందుబాటులో ఉంచాలన్నారు.

సంబంధిత పోస్ట్