చిత్తూరు జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ ఇంచార్జ్ సీఐగా నిత్యబాబును జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వన్ టౌన్ సీఐ విశ్వనాథరెడ్డి నాలుగు రోజులపాటు సెలవు పై వెళ్లారు. ఈ నేపథ్యంలో ఇన్చార్జ్ సీఐగా ట్రాఫిక్ సీఐ నిత్యబాబును నియమిస్తూ ఎస్పీ ఆదేశాలు జారీచేశారు. ఈ నెల 11 వ తేదీ వరకు వన్ టౌన్ ఇన్చార్జ్ సీఐగా నిత్యబాబు కొనసాగుతారు.