![](https://media.getlokalapp.com/cache/3f/37/3f37cd5b750789e02acdc30e6d1aa1f4.webp)
![](https://amp.dev/static/samples/img/play-icon.png)
చిత్తూరులో వైభవంగా గుండాలమ్మ గంగ జాతర
చిత్తూరు నగరంలో మంగళవారం అంగరంగ వైభవంగా గుండాలమ్మ గంగ జాతర ప్రారంభమైంది. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి తొలి మంగళహారతితో భక్తులకు ఆలయ ధర్మకర్త దర్శన భాగ్యం కల్పించారు. మహిళలు భక్తిశ్రద్ధలతో అంబళ్లు పోసి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. చిత్తూరు పరిసర ప్రాంతాలలోని ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షానికి పాత్రులైనారు.