కుప్పంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభం

596చూసినవారు
కుప్పం పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో కుప్పం సమన్వయకర్త నరేష్ నేతృత్వంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. నరేష్ మాట్లాడుతూ. 10 రోజులపాటు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నామని, 18 నుండి 60 సంవత్సరాల వయసు గల వారు‌ సభ్యత్వం నమోదు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. సభ్యత్వం తీసుకున్నవారికి 5 లక్షల బీమా వర్తిస్తుందని అన్నారు. సభ్యత్వ నమోదుకు 50 మంది వాలంటీర్లను నియమించామన్నారు.

సంబంధిత పోస్ట్