మానవ హక్కులు నూతన కమిటీ ఎన్నిక.

74చూసినవారు
మానవ హక్కులు నూతన కమిటీ ఎన్నిక.
జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో పలమనేర్ పట్టణము నందు నూతన కమిటీని ఎంపిక చేసినట్లు జిల్లా నాయకులు డివి మునిరత్నం, వేలాయుధం తెలిపారు. అందులో భాగంగా శనివారం పార్థసారథి అధ్యక్షతన సమావేశం నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సంస్థ ద్వారా రెండు సంవత్సరాల క్రితం ఓ కమిటీని ఎంపిక చేసి ఇప్పటివరకు 250 ప్రజా సమస్యలపై పోరాడి పరిష్కరించామన్నారు.