బక్రీద్ పండుగకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాము: అంజుమన్ కమిటీ

63చూసినవారు
పుంగనూరు పట్టణంలో సోమవారం నిర్వహించే బక్రీద్ పండుగకు సున్ని అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు శుక్రవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో అంజుమన్ కమిటీ ప్రెసిడెంట్ ఇనా తుల్లా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం 8 గంటలకు నమాజ్ తో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. సద్దాం హుస్సేన్ , బాబా, ఫక్రుద్దీన్, సమీ , ఖాజా తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :