ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 సమయంలో ముందస్తు చికిత్స కింద నగదు పంపిణీ సౌకర్యం నిలిపివేయబడింది. కోవిడ్ మహమ్మారి ఇప్పుడు లేనందున అడ్వాన్స్ నగదు బదిలీని నిలిపివేస్తున్నామని ఈ నిబంధన తక్షణమే అమలులోకి వస్తుందని, మినహాయింపు పొందిన ట్రస్టులకు కూడా ఇది వర్తిందని పేర్కొంది.