తల్లి మరణాన్ని తట్టుకులేక కుమారుడి మృతి

72చూసినవారు
తల్లి మరణాన్ని తట్టుకులేక కుమారుడి మృతి
తల్లి మరణాన్ని తట్టుకోలేక కుమారుడు గుండెపోటుతో మృతి చెందిన ఘటన చంద్రగిరి మండలం రాయలపురంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు. రాయలాపురానికి చెందిన రమేష్ కూలీపనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. రమేష్ తల్లి మునెమ్మ అనారోగ్యంతో గురువారం సాయంత్రం తన అన్న ఇంట్లో మృతి చెందింది. సమాచారం అందుకున్న గ్రామానికి చేరుకున్నాడు. తల్లి మృతదేహం వద్ద బోరున విలపిస్తుండగా గుండెపోటు రావడంతో కుప్పకూలి మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్