![ఎస్ ఆర్ పురంలో బెల్జియం విద్యార్థుల పర్యటన ఎస్ ఆర్ పురంలో బెల్జియం విద్యార్థుల పర్యటన](https://media.getlokalapp.com/cache/fc/78/fc7813cec6563db44aec33a897a877d0.webp)
ఎస్ ఆర్ పురంలో బెల్జియం విద్యార్థుల పర్యటన
బెల్జియం దేశానికి చెందిన 27మంది విద్యార్థుల బృందం మంగళవారం ఎస్ ఆర్ పురం మండలం పిల్లి గుండ్లపల్లె ఎస్టీ కాలనీలో పర్యటించారు. కాలనీ వాసులు సేకరించిన వన మూలికలను పరిశీలించారు. భారతీయ ఆయుర్వేదంలో వాటి ప్రాధాన్యతను వాటర్ షెడ్ చైర్మన్ వారికి వివరించారు. సహజ వనరులు, జీవ వైవిద్యం, వన మూలికలు తదితర వాటిపై అధ్యయనం కోసం భారత దేశం వచ్చినట్టు వివరించారు. స్థానికుల ఆచార వ్యవహారాలను ఆసక్తిగా తెలుసుకున్నారు.