వైభవంగా స్కందపుష్కరిణి వద్ద పౌర్ణమి గంగాహారతి

68చూసినవారు
కార్వేటినగరం మండలంలోని స్కందపుష్కరిణి వద్ద ఆదివారం పౌర్ణమిని పురస్కరించుకొని రాత్రి స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. తొలుత స్వామి వారికి వివిధ రకాల ధ్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. స్వామి వారిని, వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. అనంతరం స్కంద పుష్కరిణి వద్ద గంగా హారతి నిర్వహించారు. ఆలయమంతా శివనామ స్మరణతో మార్మోగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్