6 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులకు పూణే సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించింది. పూణె జిల్లాలోని మావల్ తాలూకాలో 24 ఏళ్ల నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ కేసులో నిందితుడిని దోషిగా నిర్ధారించిన కోర్టు మరణశిక్ష విధించింది. 2022 ఆగస్టులో ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి.. గొంతుకోసి హత్య చేశాడు.
మరుసటి రోజు, పెరట్లో బాలిక మృతదేహం కనుగొనబడింది.