మూడు ద్విచక్రవాహనాలు ఢీ.. ముగ్గురికి గాయాలు

15518చూసినవారు
కుప్పం మున్సిపాలిటీలోని డీకే పల్లి సమీపంలో ఉన్న ఎమ్ ఎల్ ఆర్ డ్రీంక్స్ ఫ్యాక్టరీ వద్ద శనివారం సాయంత్రం మూడు ద్విచక్రవాహనాలు ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలు కాగా వీరిలో పలార్లపల్లి గ్రామానికి చెందిన వెంకటాచలం తలకు తీవ్రగాయాలు అయ్యాయని‌ స్థానికులు తెలిపారు. వెంకటాచలంను కుప్పంలో ప్రథమ చికిత్స అనంతరం బెంగుళూరు నిమాన్స్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్