పంట పొలాలను ధ్వంసం చేసిన ఏనుగులు

609చూసినవారు
పంట పొలాలను ధ్వంసం చేసిన ఏనుగులు
చితూరు జిల్లా ఐరాల మండలం చుక్కవారి పల్లెలో 18 ఏనుగులు సంచరిస్తున్నట్లు వెస్ట్ అటవీశాఖ అధికారి బాలకృష్టారెడ్డి వెల్లడించారు. ఇప్పటికే పంట పొలాలను ధ్వంసం చేశాయని చెప్పారు. తాము ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామన్నారు. త్వరలోనే ఏనుగులను తిరుమల అడవులకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఏది ఏమైనప్పటికీ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆదివారం విలేకర్ల సమావేశంలో తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్