సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాయచోటి డిఎస్సి మహబూబ్ బాష నేతృత్వంలో కేంద్ర బలగాలతో కలిసి శనివారం పీలేరు పోలీసులు పట్టణంలో కవాతు చేశారు. రాబోయే ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు తమ శాఖ సిద్ధంగా ఉందని, శాంతిభద్రతలకు విఘాతం కలిగే ఎటువంటి చర్యలను ఉపేక్షించ బోమని హెచ్చరించారు. కార్యక్రమంలో పీలేరు అర్బన్ సిఐ మోహన్ రెడ్డి, ఎస్ఐ నరసింహుడు, పీలేరు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.