పుంగనూరు: వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించాలి
పుంగనూరులో ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థాయి మాలల మహా గర్జన ఆత్మీయ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహానికి చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత ఇక్కడి నుంచి ఎంబీటీ రోడ్డు గుండా పెద్ద ఎత్తున ర్యాలీగా బీఎంఎస్ క్లబ్ ఆవరణానికి చేరుకుని అక్కడ సభ నిర్వహించారు. వర్గీకరణకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.