సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సిఐ
చిత్తూరు జిల్లా పుంగనూరు మండల పరిధిలోని సమస్య ఆత్మక పోలింగ్ కేంద్రమైన వనమలదిన్నె గ్రామాన్ని గురువారం సిఐ రాఘవరెడ్డి, ఎఫ్ ఎస్ టి టీం తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ తొందరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్థానిక ప్రజలకు సూచించారు. ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా ఓటు హక్కు ను వినియోగించుకోవాలని సిఐ కోరారు.