50 మంది మావోయిస్టులు లొంగుబాటు

77చూసినవారు
50 మంది మావోయిస్టులు లొంగుబాటు
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా బీజాపూర్‌‌లో 50 మంది మావోయిస్టులు లొంగిపోయారు. బీజాపూర్ SP జితేందర్ కుమార్, CRPF డీఐజీ దేవేంద్ర నేగీ ఎదుట వీరంతా లొంగిపోయారు. అలాగే మావోయిస్టు కీలక నేత రవీంద్ర కరం సైతం లొంగిపోయినట్లు సమాచారం. ఈయనపై రూ.8 లక్ష రివార్డు ఉంది. మరో ఇద్దరు కీలక మావోయిస్టులు రాకేశ్, రోషిణిపైనా రూ.8 లక్షల చొప్పున రివార్డు ఉంది. మొత్తం 13 మంది మావోయిస్టులపై దాదాపు రూ. 60 లక్షల రివార్డు ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్