చంద్రయ్య శెట్టికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

71చూసినవారు
చంద్రయ్య శెట్టికి నివాళులర్పించిన ఎమ్మెల్యే
శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యులు, ఆర్య వైశ్య అన్నదాన సత్రం చైర్మన్ పీజే చంద్రయ్య శెట్టి మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బొజ్జల సుదీర్ రెడ్డి కూటమి నాయకులతో కలిసి గురువారం చంద్రయ్య శెట్టి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్, చెంచయ్య నాయుడు తదితరులు నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్