ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం

67చూసినవారు
తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలంలో శుక్రవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. సాయంత్రం ఐదు గంటల ప్రాంతం నుండి నల్ల మబ్బులు కమ్ముకున్నాయి. 6 గంటలకు ప్రారంభమైన వర్షంతో వీధులు జలమయం అయ్యాయి. ఉదయం ఉష్ణోగ్రత 37 డిగ్రీలు ఉండగా వాతావరణం చల్లబడింది. పట్టణవాసులు, గ్రామీణ రైతులు హర్షం వ్యక్తం చేశారు

సంబంధిత పోస్ట్