ట్రాఫిక్ సమస్యను పరిష్కరించండి

61చూసినవారు
వరదయ్యపాలెం మండల కేంద్రంలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని స్థానికుల కోరుతున్నారు. బైపాస్ లో వెళ్లాల్సిన భారీ కంటైనర్లు మండల కేంద్రంలోకి రావడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని చెప్పారు. ప్రతి అరగంటకు ఒకసారి ట్రాఫిక్ సమస్యగా మారడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు మంగళవారం ఉదయం స్థానికులు తెలిపారు. స్థానిక పోలీసులు స్పందించి కంటైనర్లు మండల రోడ్లమీద రాకుండా చూడాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్