శ్రీవారి ఏప్రిల్ నెల ఆదాయం 101. 63 కోట్లు
తిరుమల శ్రీవారిని ఏప్రిల్ నెలలో దర్శించుకున్న సంఖ్యను టీటీడీ శుక్రవారం వెల్లడించింది. ఒక్క నెలలోనే శ్రీవారిని 20. 17 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ద్వారా 101. 63 కోట్లు ఆదాయం వచ్చింది. 94. 22 లక్షల లడ్డూలను భక్తులకు విక్రయించారు. 39. 73 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. 8. 08 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని టీటీడీ అధికారులు తెలిపారు.