ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నెల 4న ఢిల్లీకి వెళ్లనున్నారు చంద్రబాబు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ, నిర్మలా సీతారామన్తో భేటీ కానున్నారు. ఈ క్రమంలోనే విభజన హామీల అమలుపై చర్చించనున్నట్లు సమాచారం. కేంద్రబడ్జెట్ ప్రతిపాదనలపై స్పష్టత వచ్చిన తర్వాత..ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్పై ముందుకు వెళ్లే యోచనలో చంద్రబాబు ఉన్నారట.