తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

79చూసినవారు
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 26 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 64,983 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 25,324 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకోగా.. రూ.3.49 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్