ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

54చూసినవారు
ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పింఛన్ నగదు జమ చేయాలని ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. బ్యాంకు ఖాతాలు లేని వారికి మాత్రం ఇంటివద్దే పింఛన్లు పంపిణీ చేస్తారు. ఏపీలో 65,49,864 మందికి పైగా పింఛన్ల పంపిణీ చేయాల్సి ఉంది. ఇందులో 48.92 లక్షల మందికి బ్యాంకుల్లో జమ చేస్తారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఈ ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్