ఏపీ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీపై కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్ లబ్దిదారులకు మే 1వ తేదీన డబ్బు బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తాజాగా తెలిపారు. బ్యాంక్ అకౌంట్లు లేనివారికి సచివాలయ సిబ్బంది ఇంటికి వచ్చి అందజేస్తారని తెలిపారు. ఈసారి మే మొదటివారంలోనే పెన్షన్ల పంపిణీని పూర్తి చేయనున్నట్లు చెప్పారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమాచారం అందించారు.