వందే భారత్ రైళ్లు సక్సెస్ కావడంతో వందే భారత్ మెట్రో రైలును ప్రారంభించేందుకు రైల్వేశాఖ యోచిస్తోంది. ఈ ఏడాది జూలైలో ట్రయల్ రన్ నిర్వహించబోతున్నట్లు ప్రాజెక్టు సీనియర్ అధికారి తెలిపారు. మెట్రోలో ఆటోమేటిక్ డోర్లు, కంఫర్ట్ కోటియన్తో పాటు ప్రస్తుతం నడుస్తున్న మెట్రో రైళ్లలో అందుబాటులో లేని అనేక ఫీచర్లు ఇందులో ఉంటాయని తెలిపారు. త్వరలోనే ఫీచర్స్తో పాటు ఫొటోలను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.