మండే ఎండ‌ల్లో.. కూల్ న్యూస్ చెప్పిన వాతావ‌ర‌ణ శాఖ‌

69చూసినవారు
మండే ఎండ‌ల్లో.. కూల్ న్యూస్ చెప్పిన వాతావ‌ర‌ణ శాఖ‌
ఏపీలో ఎండలు దంచికొడుతున్నాయి. ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత శనివారం నమోదైంది. నంద్యాల జిల్లా చాగలమర్రిలో 45.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రోజురోజుకూ పెరుగుతున్న ఎండలు, ఉక్కబోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో.. అమరావతి వాతావరణ కేంద్రం ఊరటనిచ్చే వార్త చెప్పింది. వచ్చే మూడు రోజులు ఉత్తరకోస్తాలో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

సంబంధిత పోస్ట్