ఆర్థిక క్రమశిక్షణతోనే తాము పాలన కొనసాగించామని సీఎం జగన్ తెలిపారు. "వైసీపీ పరిపాలనలో రాష్ట్ర జీడీపీ గ్రోత్ పెరిగింది. చంద్రబాబు పాలనలో రెవెన్యూ కుంటుపడిందని లెక్కలు చెప్తున్నాయి. ఆయన సంపద సృష్టించింది ఎక్కడా? మా పాలనలో కంటే బాబు పాలనలోనే అప్పులు పెరిగాయి. టీడీపీ సూపర్ సిక్స్లు, సెవెన్లు సాధ్యమేనా? మళ్లీ సంపద సృష్టిస్తా అనే అబద్దంతో మోసపు హామీలు గుప్పిస్తున్నారు." అని సీఎం దుయ్యబట్టారు.