ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. జులై 1 నుంచి 3వ తారీకు వరకూ ఆయన ఆ జిల్లాలోనే పర్యటిస్తున్నారు. పవన్ జులై 1న కాకినాడ వెళ్లనున్నారు. గొల్లప్రోలులో పింఛన్ పంపిణీ చేయనున్నారు. అనంతరం పిఠాపురంలో జనసేన నేతలతో భేటీ అవుతారు. నియోజవకర్గం సమస్యలను పవన్ కల్యాణ్ తెలుసుకోనున్నారు. 2న కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశం, 3న ఉప్పాడ బీచ్ ప్రాంతాన్ని పరిశీలిస్తారు.