అమ్మనే గెంటేసిన వ్యక్తికి అంగన్వాడీల విలువ ఏం తెలుసని
టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ ఫైర్ అయ్యారు. అంగన్వాడీల ఉద్యమానికి
టీడీపీ పూర్తి మద్దతు ఇస్తుందని చెప్పారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిరసన చేయడం కూడా నేరమేనా? అని ప్రశ్నించారు. అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం, వేతనంలో కోత వేయడం నియంత పోకడలకు పరాకాష్ఠ అని అన్నారు. ప్రభుత్వం జీవో నం.2ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.